పచ్చనేతల అసత్య ప్రచారాలు నమ్మవద్దు

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌పై పచ్చ పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని కాపు జాతికి వైయస్‌ఆర్‌సీపీ కోనసీమ కాపు నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం కోనసీమ కాపు నేతలు వైయస్‌ జగన్‌ను కలిశారు.  కాపులకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై వారు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌ కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయంగా లబ్ధిపొందాలని ఓ వర్గం కుట్రలు చేసిందన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తప్పకుండా జననేతను ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top