కొండ్రపోల్ గ్రామంలో రక్తదాన శిబిరం

మిర్యాలగుడా:

నల్గొండ జిల్లా మిర్యాలగుడా నియోజకవర్గం కొండ్రపోల్ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా దీనిని నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, తదితరులు ఇందులో పాల్గొన్నారు.

Back to Top