వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మోసం చేశారు కాబట్టే పోరాటం చేస్తున్నాం
08 Sep 2017 12:43 PM
కృష్ణా: చంద్రబాబు సర్కార్ పేద ప్రజలను విస్మరించింది కాబట్టే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగిందని ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటుందని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలపై పార్టీ బూత్ కమిటీలు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని హాజరై దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద ప్రజలను మోసం చేయడానికే ఎన్టీఆర్ హౌసింగ్ పథకం రశీదులు ఇచ్చారని, అదంతా బూటకమన్నారు. హౌసింగ్ స్కీం వల్ల 20 సంవత్సరాలు అప్పులు కట్టాల్సిన పరిస్థిని ఉంటుందన్నారు. చంద్రబాబు మోసాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.