ప్రజల కోసం పోరాడే నాయకుడు చల్లగా ఉండాలి



నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. వైయస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో కిలివేటి సంజీవయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి ఆశీస్సులతో వైయస్‌ జగన్‌ ఉన్నత పదవి అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అమ్మవారికి పాలాభిషేకం చేసినట్లు చెప్పారు. 
తిరుమలలో.. 
వైయస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుమలలోని వెంకటేశ్వరస్వామి సన్నిధిలో 1001 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో జననేత ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top