బూత్‌ కమిటీలదే కీలకపాత్ర

తూర్పుగోదావరి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బూత్‌ కమిటీల పాత్ర కీలకమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని నియోజకవర్గ పరిధి పార్టీ కార్యాలయంలో ఆయన బూత్‌కమిటీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల ప్రయోజనాలను ఇంటింటికీ వివరించాలన్నారు. అదే విధంగా మూడున్నరేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అనంతరం వారికి వైయస్‌ఆర్‌ కుటుంబం కిట్లను అందజేశారు.

Back to Top