సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ఏపీ మంత్రులపై నిఘా పెట్టండి
15 Aug 2017 9:32 AM
నంద్యాల శాసనసభ ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని వైయస్సార్సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి శైలజా కిరణ్ ఎన్నికల అధికారి భన్వర్లాల్కు విజ్ఞప్తి చేశారు. ప్రజాభిమానాన్ని అడ్డదారిలో కొనుగోలు చేసేందుకు ఏపీ క్యాబినెట్ మొత్తం నంద్యాలలోనే ఉందని, వారి పర్యటనలు, పంపకాలపై పూర్తి స్థాయి నిఘా పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యే రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు టీడీపీ నేతల మానసిక స్థితికి అద్దంపడుతున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్లో స్థిరపడ్డ నంద్యాల వాసులంతా పోలింగ్ రోజున వెళ్లి సీమ పౌరుషాన్ని చాటిచెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు.