ప్ర‌జాద‌ర‌ణ ఓర్వ‌లేక కుట్ర‌లు

- అనంత‌పురం జిల్లాలో మితిమీరుతున్న అధికార పార్టీ అరాచ‌కాలు
 - శింగ‌న‌మ‌ల ఇన్‌చార్జ్ జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్రకు అడ్డంకులు  
 

అనంతపురం: అధికార పార్టీ అరాచ‌కాల‌కు అనంత‌పురం జిల్లాలో అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను జీర్ణించుకోలేని టీడీపీ నేత‌లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉద్య‌మాల‌ను అణ‌చాల‌ని కుట్ర‌లు చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నారు. జిల్లాలో నాలుగేళ్లుగా వరుస కరువు వెంటాడుతోంది. శింగనమల నియోజకవర్గంలో హెచ్చెల్సీ కింద దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టు బీడు పడింది. హంద్రీ–నీవా ద్వారా 28 టీఎంసీల నీరు వచ్చినా ఒక ఎకరాకు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో తాగు, సాగునీరిచ్చి నియోజకవర్గ ప్రజలు, రైతులను కాపాడాలంటూ జిల్లా కలెక్టర్‌కు పలు వినతులు ఇచ్చారు. ధర్నాలు, ఆందోళనలు కూడా చేపట్టారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. ప్రభుత్వ చర్యలతో నష్టపోతున్న రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ చూసి.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు శింగనమల నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ‘మేలుకొలుపు’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. వారం రోజులుగా విజయవంతంగా సాగుతోన్న పాదయాత్రలో ప్రజలు భారీగా భాగస్వాములవుతున్నారు. అడుగడుగునా సమస్యలు ఏకరువు పెడుతున్నారు. దీంతో ఎలాగైనా పాదయాత్రను నిలిపేయించాలని ప్రభుత్వం కుట్ర పన్నింది. పోలీసులను ప్రయోగించి పాద‌యాత్ర‌ను ఆపేందుకు టీడీపీ నేత‌లు విశ్వప్రయత్నాలు చేశారు.  వందలాదిగా పోలీసుల‌ను ఉసిగొల్పినా..వేలాదిగా తరలివచ్చిన ప్రజలు తమ అభిమాన నేత ప‌ద్మావ‌తికి  రక్షణగా నిలుస్తున్నారు. 

ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా యాత్ర‌..
పాదయాత్ర ఏడోరోజైన గురువారం శింగనమల మండలం ఈస్ట్‌నర్సాపురం నుంచి మొదలైంది. మధ్యాహ్నం నిదనవాడలో భోజన విరామం తీసుకున్నారు. సాయంత్రం తిరిగి పాదయాత్రకు ఉపక్రమించారు. ఉన్నపళంగా సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్, ఎస్‌ఐ హమీద్‌లు తమ సిబ్బందితో వచ్చి యాత్రను ఆపాలని పద్మావతికి సూచించారు. ఎందుకని ఆమె ప్రశ్నించారు. బుధవారం పాదయాత్రలో ముసలప్ప అనే వ్యక్తి చేతిలోని రివాల్వర్‌ మిస్‌ఫైర్‌ అయిందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే యాత్ర ఆపాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసుల అనుమతితోనే పాదయాత్ర చేస్తున్నామని, తుపాకీ మిస్‌ఫైర్‌కు, యాత్ర ఆపేందుకు సంబంధం ఏంటని ఆమె ప్రశ్నిం చారు. ఇంతలో  అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ కూడా వచ్చి యాత్రను నిలిపేయాలన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆపే ప్రసక్తే లేదని పద్మావతి తేల్చిచెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు భారీగా తరలివచ్చారు.

పాద‌యాత్ర‌కు ఆంక్ష‌లు
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శింగ‌న‌మ‌ల స‌మ‌న్వ‌య‌క‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పాద‌యాత్ర‌కు పోలీసులు ఆంక్ష‌లు విధించారు. మైకులు వినియోగించకూడదని, తరిమెలలో సభ నిర్వహించకూడదని, డప్పులు కొట్టకూడదని పోలీసులు ఆదేశించారు. పోలీసుల షరతులకు అంగీకరించి.. ప‌ద్మావ‌తి పాదయాత్రను కొన‌సాగించారు. రాత్రివేళ కూడా వేలాది మంది మధ్య ఇల్లూరు వరకూ యాత్ర సాగింది.  పాదయాత్రకు ప్రజా స్పందనను చూసి బెదిరిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి ఎలాగైనా యాత్రను ఆపాలని కంకణం కట్టుకున్నారు. అనంతపురం చెరువు వద్ద పోలీసులను కలిసి యాత్రను ఆపుతారా? లేదంటే తామే వెళ్లి అడ్డుకోవాలా? అని శమంతకమణి తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి ఇంటికి పంపి హౌస్‌ అరెస్టు చేశారు. రాజధాని నుంచి కూడా పోలీసులపై ఒత్తిడి తెప్పించారు. ఈ క్రమంలోనే యాత్రను నిలిపేందుకు వారు శతవిధాలా యత్నించారు. ప్ర‌భుత్వం ఎన్ని కుట్ర‌లు చేస్తున్న ప్ర‌జ‌ల  మ‌ద్ద‌తుతో జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ యాత్ర  ఇంకా రెండు రోజుల పాటు కొన‌సాగ‌నుంది.
Back to Top