పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్సార్సీపీ లో చేరికలు
28 Sep 2016 3:15 PM
కర్నూలు: నీతి నిజాయతీలే పునాదులుగా
తమ వైయస్సార్సీపీ పనిచేస్తోందని పార్టీ ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. అదే
నమ్మకంతో అనేకమంది తమ పార్టీలో చేరుతున్నారని ఆమె పేర్కొన్నారు. పార్టీ యవజన విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాజా
విష్ణువర్దన్రెడ్డి ఆధ్వర్యంలో 7వ వార్డు నాయకులు నవీద్, ఉమర్, చాంద్బాషా, ఫజ్లు, అమానుల్లా, సద్దామ్, నదీమ్, దావూద్తో పాటు 200 మంది ముస్లిం మైనార్టీలో వైఎస్ఆర్సీపీలో
చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వీరికి కండువాలు కప్పి
పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గడ్డావీధిలో నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు
యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికలో ఎంపీ మాట్లాడుతూ పార్టీ పట్ల
ప్రజలు ఆకర్షితులు అవుతున్నారనేందుకు చేరికలే నిదర్శనమన్నారు. చేయగలిగిందే
చెబుదాం.. నమ్మిన ప్రజలను ఎప్పుడూ మోసం చేయకూడదని తమ పార్టీ అధ్యక్షులు వైఎస్
జగన్మోహన్రెడ్డి తరచుగా చెబుతుంటారన్నారు. నీతి, నిజాయితీలే పునాదులుగా తమ పార్టీ ఆవిర్భవించిందన్నారు. నిరుపేదలకు అండగా
నిలిచేందుకు మున్ముందు బ్యాంకర్లతో చర్చించి రుణాలు ఇప్పించే ప్రయత్నం
చేస్తానన్నారు.
పార్టీ కర్నూలు
నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ఖాన్ మాట్లాడుతూ ముస్లింలను టీడీపీ నాయకులు ఓటు
బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప సముచిత స్థానం కల్పించడం లేదు. ఆ పార్టీకి తగిన
బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త
కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రహ్మాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్.. రాష్ట్ర కార్యదర్శి గుండం
ప్రకాశ్రెడ్డి, అసెంబ్లీ పరిశీలకుడు శీలారెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ లోక్నాథ్, నాయకులు సి.హెచ్.మద్దయ్య, రఘు, నూరుల్లా ఖాద్రి, గోపినాథ్, సురేశ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.