టీడీపీ శునకాలను తరిమికొట్టండి

  • యనమల అసమర్థ ఆర్థిక మంత్రి
  • కాల్వ నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా..?
  • సోమిరెడ్డి పెద్ద సోదిరెడ్డి 
  • మోసకారి బాబును ఉరితీసినా తప్పులేదు..?
  • నంద్యాలలో సింహం ప్రజల పక్షాన గర్జిస్తుంటే..
  • మొరిగే టీడీపీ కుక్కలన్నీ గూండాగిరి చేస్తున్నాయి
  • మంత్రులు నంద్యాలలో చేరి ప్రజలను బెదిరిస్తున్నారు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ 
నంద్యాలః ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, ఆ పొడిచిన బాకు యనమల రామకృష్ణుడని వైయ్ససార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలు  ఛీ కొడితే, దొడ్డిదారిన ఎమ్మెల్సీ పుచ్చుకొని బాబు పక్కన చేరిన యనమల రామకృష్ణుడు కూడ వైయస్ జగన్ పై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ఆర్థికమంత్రి యనమల అని ఫైర్ అయ్యారు. ఆయన కూడ నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా భూమా నాగిరెడ్డిని నీవు రౌడీవి, గూండావి, ఫ్యాక్షనిస్టువని ముద్ర వేసిన మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఏం ముఖం పెట్టుకొని నంద్యాలలో భూమా ఫ్యామిలీకి ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. రౌడీకి, గూండాకు, ఫ్యాక్షనిస్టు కుటుంబానికి ఓట్లేయమని అడుగుతావా కాల్ప..? నీకు సిగ్గుగా లేదా..? భూమాను ఇష్టమొచ్చినట్టు తిట్టి అదే నాలుకతో ఓట్లేయమని అడిగేందుకు నీకు సిగ్గు, శరం, చీము నెత్తురుందా..? నీది నోరా తాటిమట్టా..? అంటూ కాల్వపై రమేష్ మండిపడ్డారు. గ్రామాల్లోని వీఆర్ఏ, వీఆర్వోలను ట్రాన్స్ ఫర్ చేసే అధికారం కూడ లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న కేఈ కృష్ణమూర్తి వైయస్ జగన్ ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. పేరుకే కేఈ ఉపముఖ్యమంత్రి, రెవెన్యూమంత్రి అని ట్రాన్స్ ఫర్లన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అన్నారు. కేఈ వైయస్ జగన్ గురించి మాట్లాడడం మాని... బీసీలకు పెద్దపీట వేస్తానన్నావ్..? పెద్ద పీట అంటే పెద్ద కుర్చీ వేయడమా బాబు..? అని ముఖ్యమంత్రిని కాలర్ పట్టుకొని నిలదీయాలన్నారు.  ట్రాన్స్ ఫర్ లన్నీ లోకేష్ కు ఎందుకిచ్చావని అడగాలన్నారు. 

సోమిరెడ్డి పెద్ద సోదిరెడ్డిగా మారాడని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. రైతులంతా దుర్భిక్షంలో ఉంటే...వారిని పట్టించుకోకుండా నంద్యాల చుట్టూ తిరుగుతున్నాడని సోమిరెడ్డిపై విరుచురుపడ్డారు. వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యల్లో  ఏ ఒక్క మాట పొరపాటు లేదని జోగి అన్నారు. ప్రజలు మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగ భావించారు కాబట్టే నిన్ను ముఖ్యమంత్రిని చేశారు. కానీ, నీవేం చేశావ్. రైతులు దీనావస్థకు వెళ్లారంటే నీవు కారణం కాదా బాబూ..?  రైతులు, డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన నిన్ను ఉరితీయాలా వద్దా..? ఇంటికో ఉద్యోగం అన్నావ్. లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. మీ అబ్బాయికి తప్ప ఎవరికైనా ఉద్యోగం ఇచ్చావా బాబూ..?ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2వేలు భృతి అన్నావ్ .ఒక్కరికైనా ఇచ్చావా...?ఇలాంటి నిన్ను నడిరోడ్డుపై ఉరితీయాలా లేదా..? 5కోట్ల ప్రజలు బాబు చేసింది తప్పు, ఉరితీసినా తప్పులేదని అంటున్నారని జోగి తెలిపారు. నంద్యాలలో సింహం ప్రజల పక్షాన గర్జిస్తుంటే...టీడీపీకి చెందిన మొరిగే కుక్కలన్నీ నంద్యాలలో చేరి ప్రజలను బెదిరించే క్రమంలో రౌడీయిజానికి పాల్పడుతున్నారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ గుంటనక్కలను ఓట్లరూపంలో నంద్యాల ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పోలీసులు, గుండాలను నంద్యాలలో మొహరించి బాబు రౌడీయిజం చేస్తున్నాడన్నారు. వైయస్  జగన్ కు నంద్యాల ప్రజలు తోడుగా నిలబడాలని జోగి విజ్ఞప్తి చేశారు. టీడీపీ కుక్కలను నంద్యాల ప్రజలు బోనులో పెడతారని అన్నారు. 
Back to Top