చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
జ్ఞానభేరి పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
05 Aug 2018 7:03 PM
నెల్లూరు: జ్ఞానభేరిల పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో సమావేశాలు నిర్వహిస్తూ మరోసారి విద్యార్థులను, యువతను మోసం చేయడానికి పూనుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క యూనివర్సిటీ కూడా స్థాపించలేదన్నారు. నెల్లూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకాణి గోవర్ధన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పుకొని ఈ రోజు ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రూ. 2 వేలని ప్రకటించి రూ. వెయ్యి ఇవ్వడం ఏంటని నిలదీశారు. రాష్ట్రంలో దాదాపు 1.7 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే వారిలో పదిశాతం మందికి కూడా రూ. వెయ్యి భృతి ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగ భృతిలో చంద్రబాబు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి చంద్రబాబు బలికాక తప్పదన్నారు