రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
జైట్లీ తానా అంటే చంద్రబాబు తందానా
29 Oct 2016 3:21 PM
హైదరాబాద్ : రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అంశాలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పచ్చి అబద్ధాలు చెబుతుంటే చంద్రబాబు దానికి వత్తాసు పలుకుతున్నాడని వైయస్ఆర్కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీకి రావాల్సిన నిధులపై గట్టిగా అడగాల్సిందిపోయి బాబు కూడా అన్ని మాకు ఇచ్చేశారని అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న వెంకయ్య కూడా ప్రజలను వంచించడానికి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రులను పొగడ్తలతో ముంచెత్తడానికే సమయాన్నిక వెచ్చించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.