కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
జననేత బాటలో విద్యార్థులు,యువత..!
28 Oct 2015 5:36 PM
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు నిరుద్యోగయువతను మోసం చేశాడని వైఎస్సార్సీపీ స్టూడెంట్ వింగ్ నాయకుడు సలాంబాబు మండిపడ్డారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్ర దశ దిశ తిరుగుతుందని తెలిసి కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విద్యార్థులు,యువత భవిష్యత్ కోసం దీక్ష చేపట్టారని ఈసందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచారన్నారు.
వైఎస్ జగన్ ను చూడాలి, తమ సమస్యలు చెప్పుకోవాలని విద్యార్థులు, యువత అంతా ముందుకు వస్తున్నారని సలాంబాబు తెలిపారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్తామన్నారు. వైఎస్ జగన్ చేపట్టే ఎలాంటి కార్యక్రమంలోనైనా పాల్గొంటామని క్షేత్రస్థాయిలో విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు.