పోలవరంపై బాబు రెండు నాల్కల ధోరణి

విజయవాడః పోలవరం ప్రాజెక్ట్ కు మహానేత స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అంకురార్పరణ జరిగిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. వైయస్ఆర్ హయాంలోనే రైట్, లెఫ్ట్ కెనాల్ లు పూర్తయ్యాయని చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా అటకెక్కిన పర్మిషన్స్ ను సాధించి పోలవరం తథ్యం అనే నమ్మకాన్ని వైయస్ఆర్ కల్పించారని చెప్పారు. కానీ బాబు ప్రభుత్వం పోలవరంపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ప్రస్తుతం  పోలవరం నిర్మాణంపై ఎన్నో అనుమానాలున్నాయని అన్నారు.

Back to Top