‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్రామ్
05 Apr 2017 5:21 PM
రాజంపేట టౌన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉపప్రధాని దివంగత బాబు జగ్జీవన్రామ్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలా శ్రీనివాస్రెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డిలు అన్నారు. స్థానిక ఆకేపాటి భవన్లో బుధవారం రాజంపేట మండల పార్టీ ఎస్సీసెల్ కన్వీనర్ దండు గోపి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలా శ్రీనివాస్రెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డిలు పాల్గొని జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో వైయస్ఆర్ సీపీ ఎస్ఆర్.యూసఫ్, జెనుగు కృష్ణారావుయాదవ్, పుత్తన శేఖర్రెడ్డి, పోలి మురళీరెడ్డి, గోవిందు బాలకృష్ణ, పసుపులేటి సుధాకర్, ఎస్ఎండీ.జాకీర్హుస్సేన్, టైగర్ హుస్సేన్, బలిజపల్లె చిన్న, పోతురాజు దివాకర్ తదితరులు పాల్గొన్నారు.