సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
జగన్తోనే ప్రజా సంక్షేమం: జక్కంపూడి
27 Aug 2012 7:09 AM
ఆలమూరు, 27 ఆగస్టు 2012 : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డితోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడిలో కొత్తపేట నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విజయలక్ష్మితో పాటు పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, వాణిజ్య విభాగం జిల్లా చైర్మన్ రెడ్డి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొల్లి నిర్మలకుమారి మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయని, రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదని ఆరోపించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఏలూరులో నిర్వహించిన ఫీజు పోరు విజయవంతమైందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు నిబద్ధతతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోరారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.