వైయస్సార్సీపీలో చేరిన బీజేపీ నేత

హైదరాబాద్ః బీజీపే నేత ఏలేశ్వరపు జగన్ మోహన్ రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ మోహన్ రాజుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, అనుచరులు వైయస్సార్సీపీలో చేరారు. వీరందరికీ వైయస్ జగన్ కుండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలే తనకు స్ఫూర్తి అని జగన్ మోహన్ రాజు అన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Back to Top