మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జగన్కు బెయిల్ కోసం పులివెందులలో ప్రార్థనలు
20 Dec 2012 10:50 AM
పులివెందుల (వైయస్ఆర్ జిల్లా) : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ పులివెందులలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. పులివెందులలోని శ్రీ వైయస్ జగన్ ఇంటిలో బుధవారం ఉదయం నుంచి ప్రార్థనలు చేశారు. ప్రముఖ చిన్న పిల్లల వ్యాధులన నిపుణుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మ ఆధ్వర్యంలో పులివెందులలో సుమారు వందమంది ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ప్రార్థనలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. హైకోర్టులో స్టాట్యుటరీ బెయిల్పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావాలని ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు సుగుణమ్మ తెలిపారు.