జగన్‌ కోసం 1.52 కోట్ల మంది సంతకాలు

హైదరాబాద్, 10 జనవరి 2013: 'జగన్ కోసం జనం సంతకం‌' కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తున్నదని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌  పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ‌పి.ఎన్‌.వి. ప్రసాద్ తెలిపారు. గురువారం నాడు హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, 'జగన్ కోసం‌ జనం సంతకం' పేరిట చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ‌విశేష స్పందన వచ్చిందన్నారు. గురువారం ఉదయం వరకూ 1.52 కోట్ల మంది సంతకాలు చేశారని ఆయన వివరించారు. సంతకాలను సిడి, హార్డుడిస్కు రూపంలో రాష్ట్రపతికి అందచేస్తామని ఆయన చెప్పారు.
Back to Top