అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
తెలంగాణలో త్వరలో జగన్ ఓదార్పుయాత్ర
25 Feb 2014 12:32 PM
హైదరాబాద్:
తెలంగాణ జిల్లాల్లో త్వరలోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేయనున్నారు. తెలంగాణ పది జిల్లాల శాసనసభా నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని శ్రీ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం వీరంతా సమావేశమయ్యారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన అభిమానుల కుటుంబాలను పరామర్శించాలని శ్రీ జగన్ ఓదార్పు యాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మాత్రమే ఓదార్పు యాత్ర పూర్తయిందని, మిగతా జిల్లాల్లో కూడా శ్రీ వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తారని, యాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. మరో అధికార ప్రతినిధి బి.జనక్ప్రసాద్, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్తో కలిసి ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
శ్రీ వైయస్ జగన్ పది జిల్లాల నేతలతో సమావేశమై పనితీరును విడివిడిగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమీక్షించారని గట్టు తెలిపారు. తొలుత ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారని, తరువాత ఇతర జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేస్తారని తెలిపారు. అంతకు ముందు గుంటూరు జిల్లాలో ఇంకా మిగిలిపోయి ఉన్న ఓదార్పు యాత్రను పూర్తిచేస్తారని చెప్పారు. తెలంగాణలో తాను పర్యటించబోతున్నానని శ్రీ జగన్ చెప్పగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోందని తెలిపా రు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీనపడిందని ఓ వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ర్పచారంలో ఏమాత్రం నిజం లేదని గట్టు ఖండించారు. తెలంగాణలో 63 శాతం మంది మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి అనే అభిప్రాయంతో ఉన్నారని ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు. విభజన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ పునర్నిర్మాణం చేసే శక్తి తనకే ఉందని చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఇరు ప్రాంతాలను సర్వనాశనం చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. శ్రీ జగన్కు అధిష్టానం టెన్ జన్పథ్ అని చంద్రబాబు విమర్శించడం సరికాదన్నారు. అసలు చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి ఇద్దరికీ సోనియాగాంధీయే అధిష్టానవర్గం అన్నారు.
పార్లమెంట్లో ఎఫ్డీఐపై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించడమే కాక, కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి మరీ ఆదుకున్న దరిద్రపు చరిత్ర చంద్రబాబుదని గట్టు నిప్పులు చెరిగారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తన మీదే పడుతుందన్న వాస్తవం చంద్రబాబు గ్రహించాలన్నారు. విభజన వ్యవహారంలో తనది ఏ వైఖరో చెప్పకుండా తప్పించుకున్న చంద్రబాబువి ద్వంద్వ ప్రమాణాలన్నారు. శ్రీ జగన్ అధికారంలోకి వస్తే మరో జైలు నిర్మిస్తారని చంద్రబాబు చెప్పడమేంటి? హైటెక్ సిటీ టెండర్లు ఇచ్చినందుకు ఎల్ అండ్ టీ సంస్థ నుంచి ఎన్టీఆర్ ట్రస్టు (పార్టీ కార్యాలయ భవనం), సొంత ఇల్లు నిర్మించుకున్న ఘనత చంద్రబాబుదన్నారు.
టీఆర్ఎస్ నేత హరీశ్రావు వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్రెడ్డి అంటే భయపడుతున్నారని గట్టు ఎద్దేవా చేశారు. అందుకే ఆయనను తెలంగాణలో పర్యటించరాదని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో శ్రీ జగన్ ఎందుకు పర్యటించకూడదని ప్రశ్నించారు. శ్రీ జగన్ తెలుగు ప్రజల ఐక్యత కోరుకున్నారన్నారు. అది తప్పేమీ కాదన్నారు. టీఆర్ఎస్ కూడా ఆంధ్ర ప్రాంతంలో శాఖ ప్రారంభించుకుంటే వద్దన్నదెవరని అన్నారు. ఓదార్పు గురించి శ్రీ జగన్కు తెలుసా అంటున్న హరీశ్రావు, ఆయన మామ కేసీఆర్ కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లకు ఎపుడైనా వెళ్లి ఓదార్చారా? అని ప్రశ్నించారు.
శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణలో తిరిగితే మానుకోట సంఘటన పునరావృతం అవుతుందని మధుయాష్కీ చెప్పడమంటే ఆయనకు శ్రీ జగన్ ఫోబియా పట్టుకుందనేది అర్థమమవుతోందని గట్టు అన్నారు.