ఆనం సోదరులకు వైయస్‌ జగన్‌ పరామర్శ




హైదరాబాద్‌:

ఆనం వివేకానందరెడ్డి మృతికి సంతాపం తెలిపిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆనం సోదరులను ఫోన్‌లో పరామర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలను వైయస్‌ జగన్‌ పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆనం వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

Back to Top