వైయస్ జగన్ కు ఆటో డ్రైవర్ల కృతజ్ఞతలు

దెందులూరు: అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని ప్రజా
మానిఫెస్టోను రూపొందించాలన్న సంకల్పంతో ప్రతిపక్ష నేత  వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా
సంకల్పయాత్రలో బుధవారం ఆటో డ్రైవర్లు సందడి చేశారు. ఏలూరులో ఆటో డ్రైవర్లకు రూ. 10
వేలు ఇస్తామన్న వైయస్ జగన్ ప్రకటనపై వారంతూ హర్షం వెలిబుచ్చుతూ కృతజ్ఞతలు తెలిపారు.  మేదినరావు పాలెం వద్ద జగన్ స్వయంగా ,ఆటో డ్రైవరు యూనిఫారం వేసుకుని,  ఆటో ఎక్కి వారి  సమస్యలు తెలుసుకున్నారు. తమ శ్రేయస్సు కోసం
తోడ్పాటునిస్తాన్న జననేతకు తామంతా అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.

Back to Top