బాబు చేపట్టేది ఆత్మఘోష యాత్ర: భూమన

తిరుపతి 30 ఆగస్టు 2013:

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న యాత్ర ఆత్మగౌరవ యాత్ర కాదని, ఆత్మఘోష యాత్రని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి  ఎద్దేవా చేశారు. రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని స్పష్టంచేశారు. చంద్రబాబు సీమాంధ్ర ద్రోహని ఆయన మండిపడ్డారు. ఆత్మఘోష యాత్రను ప్రజలు తిప్పి కొడతారని  హెచ్చరించారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా తిరుపతితో మహిళలు చేస్తున్న రిలే దీక్షకు భూమన  సంఘీభావం ప్రకటించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారన్నారు. శ్రీ జగన్ దీక్ష, వైయస్ఆర్ సీపీ చేస్తున్న పోరాటాల పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. సీమాంధ్రను తెలంగాణలో భాగంగా ఉంచేంతవరకు తమ పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వేర్పాటువాదులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టనున్న బస్సు యాత్రతో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతారని భూమన కరుణాకర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top