రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
వచ్చే సోమవారానికి విచారణ వాయిదా
31 Oct 2016 5:29 PM
హైదరాబాద్ః ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ లుథ్రా కోర్టులో వాదనలు వినిపించారు. వచ్చే సోమవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరపాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీంతో తనపై విచారణ నిలిపివేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. బాబు స్వర నమూనాలను వివిధ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లలో పరీక్షలకు పంపి, ఆ నివేదికల ఆధారంగా ఆర్కే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.