చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అన్యాయం చేస్తే తరిమికొడతారు
21 Jun 2017 3:51 PM
- అగ్రిభూములను కారుచౌకగా కొట్టేసే ప్రయత్నాలు
- చోద్యం చూస్తున్న ప్రభుత్వం
- కుట్రపూరితంగా తనకు కావాల్సిన వాళ్లకు..
- ఆస్తులు కట్టబెడితే బాబును ప్రజలు క్షమించరు
- అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
- భూములను బహిరంగ వేలం వేయాలి
- వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
హైదరాబాద్ః అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ... 40 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్య అని అన్నారు. ఇసుక, మట్టి, భూములు దోచుకున్నట్టు అగ్రిగోల్డ్ భూములను దోచుకుంటే చంద్రబాబు సర్కార్ ను ప్రజలు తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు ఇవ్వాల్సిన అఫ్పులకంటే సంస్థ ఆస్తుల విలువే ఎక్కువగా ఉంది, మీ డబ్బులకు ఏ ఢోకా లేదని చెప్పిన ప్రభుత్వం....ఆ భూములను ఏవిధంగా దోచుకోవాలా అని ప్లాన్ చేయడం దారుణమన్నారు. విజయవాడ దగ్గర ఉన్న 25 ఎకరాల భూమిని ఈటెండర్ ద్వారా కేవలం ఐదుకోట్లకే ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నింతించిందన్నారు. నష్టపోయిన వారు 30 కోట్లు ఇస్తామంటే నిబంధనలు ఒప్పకోవని ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత హైకోర్టు రెండో సారి ఆక్షన్ పెడితే అదే భూములను రూ.11 కోట్లకు పాడారన్నారు. బాధితులకు నష్టం జరుగుతున్నా నివారణకు ప్రయత్నించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ద పెద్ద లాట్స్ ఆక్షన్ కు పెడితే పెద్దమొత్తంలో కొనడానికి ఎవరూ ముందుకురారని పార్థసారధి అన్నారు. ఇన్వెస్టర్లు కుమ్మక్కై పంచుకునే విధంగా అన్యాయం జరిగే పరిస్థితులొస్తున్నందున పెద్ద పెద్ద భూములను ఆక్షన్ చేయాలన్నారు. అగ్రిగోల్డ్ భూములను బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేశారు. వాటిని చిన్న చిన్న ప్లాట్స్ చేసి అమ్మితే చాలామంది లాభపడతారని చెప్పారు. అంతేగానీ, కుట్రపూరితంగా మీకు కావాల్సిన వారికి ఆస్తులు కట్టబెడితే ప్రజలు క్షమించరున్నారు. నెల్లూరు, ఒంగోలు లాంటి పట్టణాల్లో గజం రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు పలుకుతోందని, చిత్తశుద్ధితో మార్కెట్ ధరకు పోయేలా వారిని కాపాడాలన్నారు. బాధితులకు మేలు చేసే ఆలోచనలు చేయకుండూ... ప్రభుత్వం దోబూచులాడుతూ దొంగ ఆలోచనలు చేస్తోందని పార్థసారధి ఆగ్రహించారు.