కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
లౌకికవాదానికి కట్టుబడి ఉంటా: జగన్
01 Oct 2013 9:55 AM
హైదరాబాద్ 30సెప్టెంబర్2013:తాను లౌకిక వాదానికి కట్టుబడి ఉంటానని వైయస్ఆర్ కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన విస్పష్టంగా బదులిచ్చారు. లౌకికవాదం నుంచి తాను ఎన్నడూ పక్కకి వైదొలగలేదని తెలియజేశారు. నా తీరు చంద్రబాబు మాదిరిగా ఉండదన్నారు. ఆయన ఎన్ని యూ టర్నులైనా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీని ఒక సమర్థ పాలకుడిగా తాను అభినందిస్తానని చెప్పారు. ముస్లిములైనా, క్రిస్టియన్లైనా ఇక్కడే పుట్టామనీ, ఇక్కడే జీవించాలి.. మరణించాలి అని చెప్పారు. నేను పాతతరం మనిషిని మాత్రం కాదన్నారు. నాకు కావాల్సింది శాంతి, అభివృద్ధి అని శ్రీ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతమైనదని స్పష్టంచేశారు. దాన్ని ఎటువంటి పరిస్తితిలోనూ రాజకీయం చేయరాదని చెప్పారు. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అన్ని పార్టీలనూ లౌకిక వాద వేదిక మీదకి తీసుకువచ్చి రాజకీయ వ్యవస్థలో మార్పు తేవడానికి ప్రయత్నించాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సూచించారు. అలాకాకపోతే, వేరే మతస్థులలో అభద్రతాభావాన్ని సృష్టించిన వారమవుతామని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా దేశంలో ంతర్గత ఉగ్రవాదం పెరుగుతుందన్నారు.