కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు
17 Dec 2016 7:05 PM
- వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరిన వివిధ పార్టీల నేతలు
- we for Jagan వెబ్ సైట్ ను ఆవిష్కరించిన వైయస్ జగన్
హైదరాబాద్ః వైయస్సార్సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. టీడీపీ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తున్న వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నాయకత్వానికి వివిధ పార్టీల నాయకులు ఆకర్షితులవుతున్నారు. వైయస్సార్సీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెల్లంపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు కాసు మహేష్ రెడ్డి వైయస్సార్సీపీలో చేరడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. నేడు వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున లోటస్ పాండ్ కు తరలివచ్చి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైయస్సార్సీపీ శ్రేణులు, వైయస్ఆర్, వైయస్ జగన్ అభిమానుల కోసం ఏర్పాటైన నూతన వెబ్ సైట్ we for jagan లోటస్ పాండ్ లో వైయస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ ఎన్ఆర్ఐ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ వాసుదేవరెడ్డి వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వెబ్ సైట్ ద్వారా జాబ్ డెవలప్ మెంట్ స్కిల్స్ తో పాటు హెల్త్ క్యాంప్స్ తదితర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు.