మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకను ఎలా ఆహ్వానిస్తారు?
17 Jul 2018 1:46 PM
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను మంగళవారం
జరిగిన అఖిలపక్ష సమావేశానికి, తమ పార్టీ
తరపున ఆహ్వానించడం పట్ల వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి తీవ్ర అభ్యంతరం
వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
ఉన్నప్పుడు బుట్టా రేణుక పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించేవారు. పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరిన తరువాత ఆమెను
అనర్హురాలిగా ప్రకటించాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు పలు దఫాలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు
ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యాన్ని విస్మరిస్తూ పార్లమెంట్
వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష
సమావేశానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదాలో బుట్టా రేణుకకు ఆహ్వానం పంపించడాన్ని
తీవ్రంగా పరిగణించిన రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఇదే అంశాన్ని అఖిలపక్ష సమావేశంలో
ప్రస్తావిస్తూ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.