నాయకత్వానికి వన్నెతెచ్చిన మహానేత

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 7న వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఇడుపుల పాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు.  తన తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ అంజలి ఘటించారు. 


‘వైయస్ రాజశేఖరరెడ్డి మరణించి ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన మరణంతో పూడ్చలేనంత శూన్యం ఏర్పడింది. అద్భుతమైన నాయకత్వ పటిమకు, ప్రేమాభిమానాలకు, కరుణకు గొప్ప ఉదాహరణగా నిలిచి ఆయన వెళ్లిపోయారు. ఆయన చూపిన మార్గంలో మనమంతా నడవాలని వైయస్ జగన్  ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top