పడవల్లో నవరత్నాల ఫ్లెక్సీలతో జననేతకు స్వాగతం

తూర్పు గోదావరి జిల్లా: ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌కు కోనసీమ ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. జిల్లాలోకి అడుగుపెట్టివంది మొదలు జననీరాజనాల మధ్య పాదయాత్ర సాగుతోంది. గురువారం పడవల్లో నవరత్నాల ఫ్లెక్సీలతో వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. ఒక్కో పడవలో ఒక్కో పథకాన్ని వివరించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. డెల్టా ప్రాంతాన్ని పట్టించుకునే నాథుడు లేడని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మా బతుకులు మారుతాయని మత్స్యకారులు పేర్కొన్నారు.

 
Back to Top