గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం

విజయవాడ :  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఏలూరుకు బయలుదేరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి  గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్న వైయ‌స్ జగన్ కు పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పలేటి కల్పన, రక్షణ నిధి, మేకా ప్రతాప అప్పారావుతోపాటు నేతలు కె పార్థసారధి, జోగి రమేష్, గౌతంరెడ్డి, సామినేని ఉదయభాను, డాక్టర్ దుట్టా రామచంద్రరావు  ఘన స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ జంక్షన్ వరకు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో జరిగే యువ భేరి కార్యక్రమంలో వైయస్ జగన్ పాల్గొంటారు.
Back to Top