కొవ్వూరులో జననేతకు ఘనస్వాగతం

పశ్చిమగోదావరి: జననేత పాదయాత్రకు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 185వ రోజు కొవ్వూరు నియోజకవర్గంలో అడుగుపెట్టింది. ధారవరం చేరుకున్న వైయస్‌ జగన్‌ మార్కొండపాడు మీదుగా పాదయాత్ర చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు ప్రజలంతా ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, వృద్ధులు, రైతులు.. రాజన్న బిడ్డను చూసేందుకు, కరచాలనం చేసి సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. అడుగడుగునా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. 
Back to Top