మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
సాంప్రదాయ రీతిలో వైయస్ జగన్కు అపూర్వ స్వాగతం
17 Jul 2018 1:01 PM
– కాకినాడ రూరల్ నియోజకవర్గంలోకి వైయస్ జగన్ పాదయాత్ర
తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరూరా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఒక్కో చోట ఒక్కో రకంగా అభిమానులు జననేతకు స్వాగతం పలుకుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం వైయస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ భారీ జెండాతో అభిమానులు వైయస్ జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగు దనం ఉట్టిపడేలా అభిమానులు తెల్ల చొక్కా, తెల్ల పంచె, పార్టీ కండువాలు ధరించి ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. వాడవాడల జగన్ నినాదం మారుమోగుతోంది. తమ కోసం వస్తున్న వైయస్ జగన్ను అశేషంగా ప్రజలు ఆదరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం అత్యంత అధిక మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు. ఇదే ఊపు రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని వైయస్ఆర్సీపీ నాయకులు పేర్కొంటున్నారు. వైయస్ జగన్ సీఎం కావడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.