కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదు: చింతల
03 Feb 2015 4:05 PM
చిత్తూరు: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అర్హులకు చేరడం లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సుదం మండలంలో మూడురోజుల పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పథకాలను అర్హులకు అందజేసేలా కృషి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, రీయింబర్స్మెంట్, పింఛన్లు తదితర పథకాలు పకడ్బందీగా అమలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లను వెయ్యిరూపాయలకు పెంచిన బాబు నిజమైన అర్హుల్లో సగం మందికి కోత విధించారని విమర్శించారు. ఇప్పటికీ పింఛన్ల కోసం నిత్యం తమను చాలామంది సంప్రదిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాము తొలిప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడటానికి వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.