హామీల అమలులో విఫలం

హైదరాబాద్ః అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మీరు మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్నైనా నెరవేర్చారా అని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అధికార పార్టీని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు.  5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు.  రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడ గిట్టుబాటు ధర రాని పరిస్థితి.   ఏ హామీని అమలు చేయకుండానే అన్నీ చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Back to Top