వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్సార్సీపీ ఆందోళనలతో దిగొచ్చిన సర్కార్..నీటి విడుదల
26 Oct 2016 11:33 AM
గుంటూరు : సాగునీటి విడుదల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. నాగార్జున సాగర్ జలాశయం కుడి కాలువకు బుధవారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. కుడికాల్వకు 5వేల క్యూసెక్కుల నీరు విడుదల కాగా, ఈ నీరు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 8.35 లక్షల ఎకరాల్లోని పంటలకు అందుతుంది. రోజుకు 10 టీఎంసీల చొప్పున 25 రోజులపాటు విడుదల కొనసాగనుంది. సాగునీటి విడుదల కోసం వైయస్ఆర్ సీపీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ వినుకొండ, నర్సరావుపేటలో మహాధర్నాకు నేతలు పిలుపునిచ్చారు. ధర్నా పిలుపుతో సర్కార్లో చలనం వచ్చి సాగునీటిని విడుదల చేశారు.