ప్రకాశం: వైయస్ జగన్ చెప్పిన మాట నాకు శిలా శాసనమని, ఆయన కుటుంబ సభ్యుడినని గొట్టిపాటి భరత్ అన్నారు. పర్చూరు ఇన్చార్జ్గా ఉన్న రావి రాంబాబును నియోజకవర్గ అభ్యర్థిగా వైయస్ జగన్ ప్రకటించారని, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. మా కుటుంబానికి ఏవిధంగా అండగా ఉన్నారో వైయస్ఆర్ కుటుంబానికి కూడా అండగా ఉండి రావి రాంబాబును గెలిపించాలని కోరారు.