కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రైతులను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం
25 Aug 2018 3:00 PM
విశాఖ! ప్రజా సంకల్ప యాత్రలో గోకివాడ గ్రామస్తులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రైతుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన గోకివాడ ఆనకట్ట అభివృద్ధి పనులు మహానేత మరణం తర్వాత నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆనకట్ట పూర్తయితే సుమారు 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వైయస్ జగన్ వస్తే ఆనకట్ట అభివృద్ధి జరుగుతుందని రైతులంతా ఆశిస్తున్నామన్నారు. శారద నది గట్లు కూడా బలహీనంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దీని వరదల సమయంలో వేలాది ఎకరాలు ముంపునకు గురువుతున్నాయన్నారు. గట్టు పటిష్టానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పొలాల్లోకి వెళ్లడానికి బ్రిడ్జి లేదని, వారధి నిర్మిస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సారి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని, ఆయనతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని బలంగా విశ్వసిస్తున్నామని రైతులు అన్నారు.