బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
జీఓ.. 271ని రద్దు చేయాలి
05 Aug 2016 11:35 AM
కర్నూలు:
భూమిపై రైతులకు యాజమాన్య హక్కులు హరించే జీఓ నెంబర్ 271ని వెంటనే రద్దు చేయాలని వైయస్ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి, తుగ్గలి మండల కన్వీనర్ జిట్టా నాగేష్ డిమాండ్ చేశారు. పట్టాదారు ఈ–పాస్బుక్ విధానానికి వ్యతిరేకంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైయస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ టి.దాస్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 1971లో ఆర్ఓఆర్ చట్టాన్ని సవరణ చేసి భూమి హక్కులు నిర్ధారిస్తూ భూమి యాజమాన్య హక్కు పత్రాలు(టైటిల్ డీడ్), పాసు పుస్తకాలను రైతులకు అందజేశారని గుర్తు చేశారు. దీని వల్ల రైతులకు భద్రతతో పాటు, భరోసా కలిగిందన్నారు. జీఓ నెంబర్ 271 ప్రకారం కంప్యూటర్ లో భూమి ఎవరి పేరుమీద నమోదైతే వారికే చెందుతుందని, దానికి ఏ ఆధారం అవసరం లేదని అనడం సరైంది కాదన్నారు.