ఏపీలో కూడా టీడీపీ ఖాళీ అవ్వ‌డం ఖాయం


  హైదరాబాద్‌:తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిందని, త్వరలో ఏపీలో కూడా ఖాళీ అవుతుందని  వైయ‌స్ఆర్‌ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి  అన్నారు.  ఆ భయంతోనే వైయ‌స్ జ‌గ‌న్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య చేసిన విమర్శలకు ఆయ‌న‌ కౌంటర్‌ ఇచ్చారు. గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి మాట్లాడుతూ... రావుల, సండ్ర నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.  ఐదు కోట్ల ఏపీ ప్రజలు, హోదా కోసం వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే హర్షించాల్సింది పోయి టీడీపీ నేతలు విమర్శలకు దిగడం దారుణమన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి మీ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని గట్టు టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొంటూ దొరికిపోయారని విమర్శించారు. వైయ‌స్ జగన్‌ గురించి ఇక తెలంగాణ టీడీపీ వారు ఎక్కడైనా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 


Back to Top