ఎమ్మెల్సీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకున్న గంగుల

అమ‌రావ‌తి:  ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌కు చెందిన గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి బుధ‌వారం ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకున్నారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీలుగా వైయ‌స్ఆర్‌సీపీ త‌రుఫున ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా, వారిద్ద‌రు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు  అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఆళ్ల నాని ఈ నెల 10న‌ ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాన్ని అందుకోగా, ఇవాళ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి తీసుకున్నారు. ఆయ‌న వెంట ఎమ్మెల్యే రోజా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన గంగుల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అభినందించారు.

Back to Top