వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా గంగ పూజోత్సవం
01 Nov 2017 6:15 PM
గుత్తి (అనంతపురం): గుత్తి పట్టణంలోని కోటవీధి సమీపంలో కొండపై ఉన్న కుంటలో బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు సమన్వయ కర్త వై. వెంకటరామిరెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నజీర్ మాట్లాడుతూ 15 సంవత్సరాల తర్వాత కుంట నిండిందన్నారు. కుంటలోకి నీళ్లు రావడంతో కోట వాసులందరూ ఆనందంగా ఉన్నారన్నారు. ఆంజనేయస్వామి మాలాధారుడు వైవీఆర్ చేత పూజ చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో గంగ పూజోత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ పట్టణ కార్యదర్శులు బేల్దారి చంద్ర, అరటి పండ్ల చంద్ర, వెంకటేష్, నియోజకవర్గం అధికార ప్రతినిధి దశరథ రామిరెడ్డి సీనియర్ నాయకులు సుంకప్ప, ఎద్దుల శంకర్, బాషా, జీపు రమణ తదితరులు పాల్గొన్నారు.