`గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌` స‌మీక్షా స‌మావేశాలు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌తన కేంద్ర కార్యాల‌యంలో నేటి ఉద‌యం 11 గంట‌ల‌కు `గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌` కార్య‌క్ర‌మంపై స‌మీక్షా స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. చంద్ర‌బాబు రెండేళ్ల పాలన వైఫ‌ల్యాల‌తో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన గడప గడపకు వైయ‌స్ఆర్ కార్యక్రమం ఎలా జ‌రిగింది, ఇంకా ఏం చేయాల‌నే దానిపై ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నాయకులతో చ‌ర్చించ‌నున్నారు. అలాగే ఇక ముందు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌నేదానిపై నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. రేపు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల నేతలతో వైయ‌స్‌ జగన్ సమావేశం కానున్నారు.

Back to Top