గామాలపాడులో మహానేత విగ్రహావిష్కరణ

గామాలపాడు (గుంటూరు జిల్లా), 24 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహ‌న్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారంనాడు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. మధ్యాహ్నం గామాలపాడు చేరుకున్న శ్రీమతి షర్మిలకు అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గామాలపాడులో అభిమానులు ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు.
Back to Top