మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రజా సమస్యలపై పోరాడుదాం
09 Feb 2017 6:39 PM
కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
కురుపాం: ప్రజా సమస్యలపై పోరాడుదామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. చినమేరంగి గ్రామంలో కురుపాం మండలానికి చెందిన వైయస్ఆర్ సీపీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ గ్రామానికి ఇద్దరు చొప్పున కార్యకర్తలను ఎంపికచేసి వారితో గ్రామంలో సమస్యలు తెలుసుకొని పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఇద్దరు చురుకైన కార్యకర్తలను ఎంపికచేసిన గ్రామంలో ఉన్న పింఛన్లు, తెల్లరేషనుకార్డులు, సీసీరోడ్లు తదితర సమస్యలు ముందుగానే గుర్తించి వాటిపై పోరాటం చేయడానికి కార్యకర్తలను సమాయత్తం చేయడానికి సమావేశం ఏర్పాటుచేసామని తెలిపారు. ప్రతి గ్రామంలోను చాలా అక్రమాలు జరుగుతున్నాయని వాటిని ముందుగానే గుర్తించాలని అన్నారు.ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని రానున్న రోజులు మనవేనని అన్నారు. సమావేశంలో కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి, జిల్లా నాయకులు శెట్టి నాగేశ్వరరావు, కురుపాం మండల కన్వీనర్ ఇంటికొప్పుల గౌరీశంకర్, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయితీ పెద్దలు పాల్గొన్నారు.