తండ్రీ కొడుకులు రాష్ట్రాన్ని అవినీతి చేశారు

బంధువులకు, బినామీలకు కారుచౌకకు భూములు
ప్రత్యేక హోదా బ్రాండ్‌ అంబాసిడర్‌ వైయస్‌ జగన్‌
హోదా ఎవరిస్తే వారికే మద్దతు ఇస్తాం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే లు రవీంద్రనాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి

కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేష్‌బాబులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రూ. 240 కోట్లు విలువ చేసే స్థలాన్ని జీఓ నంబర్‌.523, 547 ద్వారా చంద్రబాబు తన బంధువులకు, బినామీలకు కారుచౌకగా అమ్మేశాడని ఆరోపించారు. మూడేళ్లు సంసారం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన ఇప్పుడు మూడు పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని విమర్శించారు. రూ. లక్షల కోట్ల నిధులు దుర్వినియోగం చేసి ఈరోజు కేంద్రం ఇవ్వలేదని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ప్రత్యేక హోదాకు ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారే తప్ప బీజేపీకి మద్దతు ఇస్తామని వైయస్‌ జగన్‌ ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు.

జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఆదినారాయణ రెడ్డి  చేసిందీ ఏమీ లేదన్నారు. గండికోట ముంపు బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని, కేంద్రం అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి కేవలం వసూళ్ల కోసమే చంద్రబాబు పని చేస్తున్నారని ఆరోపించారు. 
 
Back to Top