వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అవసరమైతే ఎంపీలతో రాజీనామా
26 Sep 2016 1:34 AM
() ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ఉద్యమం
() అందరితో కలిసి పోరాట బాట
() చంద్రబాబు అన్నింట్లో అవినీతే
() అవసరమైతే ఎంపీలతో రాజీనామా
() ప్రజల తీర్పుతో కళ్లు తెరిపిస్తాం
() వివిధ దశల్లో ప్రత్యేక హోదా కోసం
పోరాటం
హైదరాబాద్: ప్రత్యేక హోదా
కోసం మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని ప్రతిపక్షనేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్
జగన్ వెల్లడించారు. ఖండాంతరాల్లో ఉన్న తెలుగువారిని చైతన్యపరిచేందుకు వైయస్ జగన్
నేరుగా ప్రవాసాంధ్రులతో మాట్లాడారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో
సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో అనేక అంశాలపై
వైయస్ జగన్ విపులంగా చర్చించారు.
మొదటగా
వైయస్ జగన్ ప్రత్యేక హోదా ప్రాధాన్యాన్ని వివరించారు. అదే సమయంలో చంద్రబాబు
చేస్తున్న మోసాల్ని ఎండగట్టారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని, హైదరాబాద్ నగరం మనకు లేకుండా పోవడం వల్ల 98 శాతంపైనే కంపెనీలు కోల్పోయామని చెప్పారు. 70 శాతం ఉత్పత్తి రంగం హైదరాబాద్ లోనే ఉందని గుర్తు చేశారు.ఇప్పుడున్న మౌలిక వసతులతో మనం పోటీ పడలేమని, ప్రత్యేక హోదా వస్తేనే అన్ని వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా
వస్తే ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని, పారిశ్రామిక
రాయితీలు వస్తాయని వెల్లడించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే
రాయితీలు వస్తాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని
మరింత ఉధృతం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. అవసరమైతే తమ ఎంపీలతో రాజీనామా
చేయిస్తామని స్పష్టం చేశారు. సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రత్యేక హోదా సాధన కోసం అందరినీ కలుపుకు పోతామని, పోరాటం చేస్తే
కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చితీరుతుందని ఆయన భరోసాయిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన
హామీని సాధించుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన అవిభజన
సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీయిచ్చిందన్నారు.
హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు
మాట్లాడడం లేదన్నారు. హోదా ఇవ్వబోమన్న జైట్లీ ప్రకటనను చంద్రబాబు సిగ్గులేకుండా
స్వాగతించారని ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ ప్రకటన మొత్తం చూస్తే ఎవరు థ్యాంక్స్
చెప్పరని అన్నారు. మన రావాల్సిన వాటా కంటే ఏమీ రానప్పుడు ప్యాకేజీ అని ఎలా అంటారని
ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా రాజీపడ్డారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే నీరుగార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.
ఎన్ఆర్ఐలతో వైయస్ జగన్ ముఖాముఖి
- చంద్రబాబు
లాంటి అబద్దాలకోరు మరెవరూ ఉండరు - చంద్రబాబు
మాదిరిగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం భారత్ లో ఆయనకే చెల్లు - అసాధ్యం
అనుకొన్న తెలంగాణను సాధించగలిగినప్పుడు ప్రత్యేక హోదాను సాధించటం కష్టమేమీ
కాదు - ప్రజాస్వామ్యంలో
పోరాటమే పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది. - చంద్రబాబు
వంటి అబద్దాలు చెప్పేవారు ఎక్కడా ఉండరు. - తాను
ఎమ్మే చేశానని, పీహెచ్డీ చేశానని చెప్పుకొన్నారు. ఎవరూ డాక్టర్ చంద్రబాబు అని
ఎందుకు అనటం లేదు - సెల్
ఫోన్ తానే కనిపెట్టానని, ఇంకా చాలా చెప్పుకోవటం మనం చూశాం - ఆయన
ఎంత గొప్పగా ఇంగ్లీషు మాట్లాడుతారో అందరికీ తెలుసు - అసలు
చంద్రబాబుకి అరుణ్ జైట్లీ ప్రకటన ఎంతవరకు అర్థం అయిందో తెలియదు, కానీ
స్వాగతించారు - శాసనమండలిలో
ప్రత్యేక సాయం గురించి ప్రకటన చేశారు, కేంద్రానికి చాలా ధన్యవాదాలు తెలిపారు - పోలవరం
ప్రాజెక్టు నిబంధనలను అడ్డగోలుగా మార్చారు - వ్యవస్థలో
మార్పు రావాలి, నేతలను నిలదీసే పరిస్థితి
రావాలి - ఎన్నాళ్లు
బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం - పోలవరంకు
సంబంధించి కూడా చాలావి ఇవ్వటం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. - అన్యాయంగా
అదే పోలవరం కాంట్రాక్టర్ ను కొనసాగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాపత్రయ
పడుతోంది. - పోలవరం
అథారిటీ ఎంత మొత్తుకొంటున్నా అదే కాంట్రాక్టర్ కు సబ్ కాంట్రాక్టర్లను
అప్పగించి నడిపిస్తోంది. - కాంట్రాక్టర్
సరిగ్గా పనిచేయకపోయినా సరే చంద్రబాబు పట్టించుకోవటం లేదు. - కేంద్రంకే
బాధ్యత ఇచ్చి ఒత్తిడి చేసి పనిచేయించాల్సింది పోయి, చంద్రబాబు తప్పు దారి
పట్టిస్తున్నారు. - పరిశ్రమలు
వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుంది - ప్రత్యేక
హోదా వస్తేనే పారిశ్రామిక రాయితీలు వస్తాయి - రాయితీలు
ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు - ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులే మోసం చేస్తే పరిస్థితి వస్తే
ఇంకెవరికి చెప్పాలి? - అరుణ్ జైట్లీ
ఏమిచ్చారో అందరికి అర్థం అవుతోంది. - రాతపూర్వకంగా అరుణ్
జైట్లీ ఇచ్చిన ప్రకటన ను మనం అంతా చూడవచ్చు. - అరుణ్ జైట్లీ
విదిలించిన దానికే చంద్రబాబు చంకలు గుద్దుకొంటున్నారు. - బుందేల్ ఖండ్ ప్యాకేజీ
స్పష్టంగా ఉంటే, అందులో 3,700 కోట్లు కూడా ఇవ్వకుండా తిప్పించినా, చంద్రబాబు
థాంక్సు చెబుతున్నారు. - ప్రత్యేక హోదాను
నిట్టనిలువుగా ముంచేసినా చంద్రబాబు సంతోషం వెలిబుచ్చుతున్నారు. - ప్రత్యేక
హోదా ఉద్యమంలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతాం - ప్రజా
సంఘాలు, కమ్యూనిస్టులతో కలిసే
ముందుకు సాగుతున్నాం - ఓటుకు
కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయారు - బీజేపీ
రాష్ట్రానికి ఏం చేసినా చేయకపోయినా తన కేసులను పట్టించుకోకపోయినా ఫర్వాలేదని
బాబు అనుకుంటున్నారు - రాష్ట్ర
ప్రజల తరపున నిజాయితీగా పోరాడుతున్నది మాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారు - అందరు
కలిసి రాబట్టే ప్రత్యేక హోదా కోసం చేపడుతున్న ప్రతి ఆందోళన విజయవంతం అవుతోంది - మా
ఆందోళనలతో హోదాపై ప్రజలందరినీ చైతన్యపరుస్తున్నాం, మా ధ్యేయం హోదా సాధించమే - హోదా
సంజీవనే.. పదేళ్లు కాదు పదిహేనేళ్లు ఇవ్వాలన్న చంద్రబాబు, వెంకయ్య నాయుడే ఇవాళ మాట మారుస్తున్నారు - విభజనపై
యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏపీలో కాంగ్రెస్ ఎలా చతికిలపడిందో..
ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీది
కూడా అదే పరిస్థితి - ప్రత్యేక
హోదా ఇచ్చే అధికారం ఒక్క ప్రధానిమంత్రికే ఉంది - ప్రత్యేక
హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడు
చెప్పలేదు. ఆ సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖ చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది - ప్రత్యేక
హోదా ఉన్న జమ్మూకశ్మీర్ కు ప్రధాని మోదీ రూ. 80 వేల
కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. అయితే హోదా ఉండనట్టా? - 2019లో కేంద్రంలో కచ్చితంగా
సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. 280 సీట్లు
ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. 22-23 సీట్లు
గెల్చుకుంటే కేంద్రాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది - వినుకొండ
ఎమ్మెల్యే ఎక్కడో ప్రత్యేక హోదా ఇచ్చిన హిమచల్ ప్రదేశ్ లో కంపెనీ పెట్టారు
దీనిని ఏమనాలి? - హోదా
వచ్చే లాభాలతో పారిశ్రామికవేత్తలు వారంతట వారే పెట్టుబడులు పెడతారు - అరుణ్
జైట్లీ ప్రకటన వింటే ఎవరికీ థాంక్స్ చెప్పాలని అనిపించదు - రాష్ట్రానికి
రావాల్సిన నిధులే పేరు మార్చి ఇస్తున్నారు - మన
హక్కు ప్రకారం రావాల్సిన వాటినే ఇస్తున్నప్పుడు ప్యాకేజీ అని ఎలా అంటారు - రాజధాని
విషయంలో చంద్రబాబు అందరినీ తప్పుదోవ పట్టించారు - 4 పంటలు పండే భూములను
మాయమాటలు చెప్పి రైతుల నుంచి కొట్టేశారు - ఇప్పుడు
స్విజ్ చాలెంజ్ పేరుతో కాలయాపన చేస్తున్నారు - పార్టీ
మారి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు
రాజీనామా చేయించరు - చంద్రబాబు
అవినీతి ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు - ఏపీలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది
- ప్రత్యేక
హోదాను పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తోంది - అయినా
సరే చంద్రబాబు థాంక్సులు చెప్పటం, ఎలా పోరాటం చేస్తారని అడగటం చేస్తున్నారు - చదువుకున్న
యువత, మంచి నైపుణ్యం ఉన్న యువత
ఉంది - ప్రత్యేక
హోదా వస్తే వాళ్లందరికీ మేలు జరుగుతుంది - ఎవరు
ధైర్యం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో పోరాడితే కచ్చితంగా హోదా వస్తుంది - మనం
పోరాడుతుంటే చంద్రబాబు అడ్డుకొంటారు - కేంద్రం
ఇవ్వకపోయినా, చంద్రబాబు అడ్డుకొంటున్నా కానీ మనం పోరాడతాం - ప్రత్యేక
హోదా కోసం అందరూ కలిసి రావాలి. మీ అందరి మద్దతు కావాలి - పోరాటం
చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది - అసలు
చంద్రబాబే పోరాటం చేయాలి, మంత్రుల్ని ఉఫసంహరించాల్సిన పరిస్థితి - చంద్రబాబు
చేయకపోవటం వల్లనే మనం పోరాడుతున్నాం - ఎన్నాళ్లు బతికాం అన్నది ముఖ్యం కాదు , ఎంత బాగా బతికాం అన్నది ముఖ్యం
- రాజకీయాల్లో ప్రస్తుతం అబద్దాల సీజన్ నడుస్తోంది
- ఎన్నికల సమయంలో అబద్దాలు చెప్పటం, తర్వాత మరిచిపోవటం చేస్తున్నారు
- నాకు చక్కటి క్యారెక్టర్ ఉంది. దాన్ని ఎప్పటికీ కోల్పోలేదు, నేను కోల్పోను కూడా
- ప్రత్యేక హోదా కోసం మీరంతా కలిసిరావాలి. అంతా కలిసికట్టుగా పోరాడుదాం