రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఎవరినీ ఆకట్టుకోలేకపోయిన బడ్జెట్: మేకపాటి
28 Feb 2013 6:31 PM
న్యూఢిల్లీ, 28 ఫిబ్రవరి 2013: కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఏ ఒక్క వర్గాన్నీ ఆకట్టుకోలేకపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వార్షిక బడ్జెట్ సగటు భారతీయుడి అంచనాలకు అందని విధంగా ఉందని ఆయన గురువారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. రైతులంతా ఆశగా ఎదురు చూసిన వ్యవసాయ రుణాల మాఫీపై ఎలాంటి ప్రకటనా ఈ బడ్జెట్ చేయలేదన్నారు. ఉద్యోగులకు కూడా ఈ బడ్జెట్ వల్ల నిరాశే మిగిలిందన్నారు.
ముఖ్యంగా ఈ బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఒరిగింది ఏమీ లేదని మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా లభిస్తుందని భావించామని, ఆ విషయంలో కూడా రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.