ఎర్రబాలెం నుంచి షర్మిల యాత్ర ప్రారంభం

హైదరాబాద్, 25 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం ఉదయం మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రబాలెం గ్రామం నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికి వంద రోజులు పూర్తయ్యింది.  యాత్ర మంగళగిరి నియోజకవర్గంలో సాగుతుందని  వైయస్ఆర్‌ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి సోమవారం ఉదయం బయలుదేరి డోలాస్‌నగర్, నులకపేట మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం ముగ్గురోడ్, నెహ్రూ బొమ్మ సెంటర్, ఉండవల్లి, కె.ఎల్.రావునగర్ మీదుగా రాత్రి బసకు చేరతారు.

Back to Top