ఈ నెల 25న క లెక్టరేట్ల ఎదుట ఆందోళన

హైదరాబాద్ : సాగునీటి
రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా ఈ నెల 25న జిల్లా
కలెక్టరేట్ ల ఎదుట ఆందోళన చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఇందులో పార్టీ
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొంటారని వివరించింది.
హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీమంత్రి, సీనియర్‌నేత
డాక్టర్ ఎంవీ మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

        కృష్ణా జలాల్ని సాధించటంలో చంద్రబాబు ప్రభుత్వం రాజీపడినట్లుగా కనిపిస్తోందని
ఆయన వివరించారు. ట్రి బ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాపాడటంలో సర్కారు విఫలం
అయిందని వివరించారు. ఓటుకు కోట్లు కుంభకోణం లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవటం వల్లే
ఈ విషయంలో బాబు రాజీపడినట్లుగా కనిపిస్తోందని ఆయన అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్
రైతుల హక్కులు కాలరాయటం అన్యాయమని ఆయన అన్నారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర లేకపోవటం, కృష్ణా జలాల హక్కుల్ని కాపాడటంలో
ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 25న కలెక్టరేట్ ల ఎదుట ధర్నాలు
చేస్తామని మైసూరా రెడ్డి వివరించారు.       

Back to Top