రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
అదృష్టం కొద్దీ దుర్గమ్మ కొండమీద ఉంది
05 Aug 2016 2:31 PM
విజయవాడ: తొలగించిన దేవాలయాలను వెంటనే నిర్మించాలని డిమాండ్ తో దీక్ష చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులను వైయస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధ పరామర్శించారు. దేవాలయాల పునర్నిర్మాణం కోసం వారు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ.. మన అదృష్టం కొద్దీ దుర్గమ్మ కొండ మీద ఉందని....లేకుంటే అమ్మవారి దేవాలయాన్ని కూడా చంద్రబాబు తొలగించే వారన్నారు.
కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు విజయవాడలోని దేవాలయాలను దర్శించుకునే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. తొలగించిన దేవాలయాలను వెంటనే పునర్నిర్మించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని వంగవీటి డిమాండ్ చేశారు.